తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు గారు హాజరై లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నర్సింగ్ రావు మాట్లాడుతూకాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.ముఖ్యంగా సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం...