తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 4 రామారెడ్డి మండలం అన్నారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.రవీందర్ గౌడ్ తనిఖీ చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్య సేవలు పొందిన వారి వివరాలను మెడికల్ ఆఫీసర్ డా.వేణు మాధవ్ను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులను గుర్తించి సరైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ల్యాబ్, ఫార్మసీ గదులను పరిశీలించారు.