Friday, May 22, 2026
HomeUncategorizedరమేష్ గౌడ్ పై ఆరోపణలు సరికాదు

రమేష్ గౌడ్ పై ఆరోపణలు సరికాదు

📰 Generate e-Paper Clip

అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సిగ్గు చేటు

ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా తినిది కామారెడ్డి. ఏప్రిల్ 17:

జిల్లా కేంద్రంలోని ఆర్. అండ్. బి. అతిథి గృహంలో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధి పేట గ్రామ అంబేద్కర్ బహుజన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
బహుజన బిడ్డ అయిన పల్లె రమేష్ గౌడ్ పై కొంతమంది తమ స్వార్థం కోసం ఆరోపణలు చేస్తూ చేసిన ఫిర్యాదును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే దళిత, బహుజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని దళిత, బహుజన సంఘాల నాయకులు హెచ్చరించారు.పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ ప్రజా సేవకుడు అని, అతడు దళితులను అవమానించే వ్యక్తి కాదన్నారు. కులమతాలకు అతీతంగా అందరితో కలసి ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై కొంతమంది తప్పుడు ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఆయనపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే వారు గ్రామంలో మాట్లాడుకోవాలి తప్ప ఇలా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. తనతో రాజకీయ విభేదాలు ఉంటే గ్రామంలో చూసుకోవాలే తప్ప కొంత మందిని ఉసిగొలిపి ఇలా కేసులు పెట్టించడం తగదని ఫరీద్ పేట గ్రామ సర్పంచ్ నర్సింహ రెడ్డి కి సూచించారు. గ్రామంలో ప్రతీ యేటా జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో దళితులను ప్రత్యేకంగా పిలిచి బట్టలు పెట్టి పూజలో కూర్చుండబెట్టిన రమేష్ గౌడ్ పైన దళితులను కించపరిచేలా మాట్లాడాడని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. గ్రామంలో అభివృద్ధి ఎవరి ద్వారా చేశారో గ్రామంలో నిరూపించుకోవాలని గుర్తు చేశారు ఇప్పటికైనా రమేష్ గౌడ్ పై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని లేనియెడల తమ ఇండ్లను ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. అనంతరం ఏఎస్పి చైతన్య రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో దళిత, బహుజన సంఘాల నాయకులు దేవుళ్ళ రాములు, బైండ్ల రామస్వామి, విష్ణు, లక్ష్మీనర్సు, భూమవ్వ, కొంగల లక్ష్మి, రాజమణి, వరలక్ష్మి, తగిరంచ రాజిరెడ్డి, పెరుమాండ్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments