తెలంగాణ కెరటం మేడ్చల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 21)
హైదరాబాద్కు చెందిన పి.ఎల్. కార్తిక్ కుమార్ తమ కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన భూమి పత్రాలు పోయినట్టు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన కీసర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం (SRO) వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, కార్తిక్ కుమార్ తల్లి వై. లక్ష్మీనారాయణి భర్త పేరుపై ఉన్న భూమి పత్రాలకు సంబంధించి ఈసీ (Encumbrance Certificate) కోసం దరఖాస్తు చేసేందుకు SRO కార్యాలయానికి వెళ్లిన సమయంలో ఆ పత్రాలు కనిపించకుండా పోయినట్లు ఆయన చెప్పారు.పోయిన పత్రాలలో డాక్యుమెంట్ నంబర్ 1383/1988తో పాటు కళావతి లక్ష్మీనారాయణ గారి మరణ ధృవపత్రం కూడా ఉన్నట్లు తెలిపారు.ఈ పత్రాలు ఎవరికైనా దొరికితే వెంటనే 9666 266687 నంబర్కు సమాచారం ఇవ్వాలని పి.ఎల్. కార్తిక్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

